Header Banner

Pakistan: పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు..! పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్!

  Wed Jun 18, 2025 14:41        Others

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక స‌మాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!


ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

కాగా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు గతంలోనూ దాడులకు గురైంది. ఈ ఏడాది మార్చి నెలలో పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి, వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ భద్రతా సిబ్బందిని కూడా మిలిటెంట్లు హతమార్చారు. అనంతరం పాక్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే రైలు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

 

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanBlast #TrainDerailment #JaffarExpress #RailwayAttack #PakistanNews #BombExplosion #TerrorAttack #RailwayAccident